మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి (ఫోటోలు)
హైదరాబాద్: విద్యుత్ శాఖ మంత్రిగా డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య లక్ష్మారెడ్డి చాంబర్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కరెంటు కష్టాలను అధిగమించి వచ్చే మూడేండ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
వ్యవసాయరంగానికి పూర్తిస్థాయిలో విద్యుత్ను అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యుత్సంస్థలకు సంబంధించిన వివరాలను సీఎండీ ప్రభాకర్రావు మంత్రికి వివరించారు. రాష్ట్రమంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికబోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్గౌడ్, ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డి తదితరులు మంత్రిని అభినందించారు.
ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్పీడీఎల్ సీఎండీ రఘమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కే వెంకటనారాయణ, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు టీ శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి తదితరులు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రిగా డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టడానికి ముందు రిబ్బన కట్ చేస్తున్న దృశ్యం.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి
వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య లక్ష్మారెడ్డి చాంబర్లోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి
విద్యుత్ శాఖ మంత్రిగా డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన భార్య అభినందనలు తెలుపుతున్న దృశ్యం.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి
విద్యుత్ శాఖ మంత్రిగా డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన భార్య అభినందనలు తెలుపుతున్న దృశ్యం.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి
విద్యుత్ శాఖ మంత్రిగా డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం అభినందిస్తున్న రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి
విద్యుత్ శాఖ మంత్రిగా డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన భార్య, కుమార్తె స్వీట్స్ తినిపిస్తున్నదృశ్యం.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి
విద్యుత్ శాఖ మంత్రిగా డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో సంతకం చేస్తున్న దృశ్యం. విద్యుత్సంస్థలకు సంబంధించిన వివరాలను సీఎండీ ప్రభాకర్రావు మంత్రికి వివరించారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డి
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కరెంటు కష్టాలను అధిగమించి వచ్చే మూడేండ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications