మందుబాబులకు బాడ్న్యూస్: 20 శాతం వరకు పెరగనున్న మందు ధర..? రేపట్నుంచి కొత్త మద్యం పాలసీ..
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈసారి మద్యం ధరలు పెరుగుతాయని ఆబ్కారీ శాఖ సంకేతాలు ఇచ్చింది. ఇటీవల ఏపీలో కూడా మద్యం ధరలు పెంచిన సంగతి తెలిసిందే. పొరుగురాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మద్యం ధర పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.

20 శాతం పెంపు..?
ఏపీలో ఇటీవల కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యంపై 15 నుంచి 20 శాతం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా మద్యం ధరలు పెంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. 20 శాతం వరకు ధర పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ దీనిని ఆబ్కారీ శాఖ అధికారులు ధ్రువీకరించలేదు.

తొలుత రాని స్పందన
కొత్త మద్యం పాలసీ ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేయడంతో తొలుత వ్యాపారుల నుంచి ఆశించిన మేర స్పందన రాలేదు. తర్వాత మాత్రం ఏపీ సరిహద్దుకు చెందిన వ్యాపారులు జోరుగా దాఖలు చేశారు. మరోవైపు లైసెన్స్ ఫీజును కూడా ఆబ్కారీ శాఖ పెంచింది. ఇదివరకు రూ.లక్ష ఉన్న ఫీజును రూ.2 లక్షలు చేసిన సంగతి తెలిసిందే.

ఆరు స్లాబుల్లో..
ఇదివరకు ఉన్న నాలుగు స్లాబులను కూడా ఆరుగా చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం షాపులో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వైన్స్ షాపు తెరచి ఉంటాయని పేర్కొన్నది. ఇతర ప్రాంతాల్లో రాత్రి 10 గంటలకే మూసివేస్తారని స్పష్టంచేసింది. డిసెండర్ 31 సమయంలో మాత్రం గడువును ప్రతీ ఏటా పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. బార్లు, పబ్లతోపాటు వైన్స్ సమయం కూడా పెంచుతారు.

కలవరం..
కొత్త మద్యం పాలసీ పేరుతో ధరలు పెంచుతారనే వార్తలు మందుబాబులను కలవరానికి గురిచేస్తోంది. ధరల పెంపు ఊహాగానాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రతీసారి మందు ధర పెంచుతారా అంటూ వాపోతున్నారు. మరోవైపు వ్యాపారులు మాత్రం తమ ఫీజును మాత్రం డబుల్ చేశారని వాపోయారు. వారు మద్యం ధరల పెంపుపై మాత్రం స్పందించలేదు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications