హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లారీ బీభత్సం: ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు, భద్రాద్రిలో విషాదం

|
Google Oneindia TeluguNews

Recommended Video

లారీ బీభత్సం..ఇద్దరు మృతి.. భద్రాద్రిలో విషాదం..!

హైదరాబాద్‌: నగర శివారు వనస్థలిపురం సుష్మా సమీపంలో విజయవాడ రహదారిపై ఇసుక లారీ బుధవారం బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకెళ్లి దాని ముందర వెళ్తున్న ద్విచక్రవాహనంతో పాటు మూడు ఆటోలను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుటుంబసభ్యుల్లో తండ్రీ కొడుకులు మృతిచెందారు. మరో మహిళ, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

lorry accident: Three killed

భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆటోల్లో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

టిప్పర్ బీభత్సతం: బాలుడు మృతి

భద్రాద్రి జిల్లా చండ్రుగొండ ప్రధాన సెంటర్‌లో టిప్పర్‌ ఢీకొని ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. టిఫిన్‌ కోసమని తాతతో కలిసి వెళ్తున్న చెర్రీ అనే బాలుడిని కొత్తగూడెం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో చెర్రీ అక్కడికక్కడే మృతిచెందగా, బాలుడి తాత గాంధీ తీవ్రంగా గాయపడ్డాడు.

దీంతో ఆగ్రహించిన స్థానికులు టిప్పర్‌ను ధ్వంసం చేశారు. ఈ ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

English summary
Three killed in a lorry and truck accidents happened in Hyderabad and Bhadrachalam districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X