భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి లాడ్జీకి, విషం తాగి, చివరికిలా....
భర్తతో కొంతకాలంగా సఖ్యత లేదు. అదే సమయంలో గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి ఆమె ఇంటినుండి పారిపోయింది.
సంగారెడ్డి:భర్తతో కొంతకాలంగా సఖ్యత లేదు. అదే సమయంలో గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి ఆమె ఇంటినుండి పారిపోయింది.అయితే చివరకు ప్రియుడితో కలిసి ఆమె ఆత్మహత్యయత్నం చేసింది.అయితే చివరినిమిషంలో 108 ఫోన్ చేయడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి అదే గ్రామానికి చెందిన శిరీషతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నారు.

ఈ క్రమంలో శిరీషకు ఆమె భర్త యాదయ్యకు మద్య విబేధాలు వచ్చాయి.వారికి ఇద్దరు పిల్లలున్నారు. దీంతో శిరీష ఆమె ప్రియుడు అనిల్ రెడ్డితో కలిసి రెండు రోజుల క్రితం సంగారెడ్డికి వచ్చారు.
శిరీష తనభర్తకు సమాచారం ఇవ్వకుండానే వచ్చేసింది. సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లిలోని లాడ్జీలో వారు బస చేశారు.
జీవితంపై విరక్తి చెందిన సోమవారం నాడు మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.అయితే చివరకు ఏమనుకొన్నారో ఏమో 108 కు ఫోన్ చేశారు.
సమాచారం అందుకొన్న పోలీసులు లాడ్జికి చేరుకొన్నారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకొన్న అనిల్ రెడ్డి, శిరీషను చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ ఐ శివలింగం చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications