ఆ సమస్య ఉంటే ఇబ్బందులు, కరోనాపై మంత్రి ఈటల రాజేందర్ కామెంట్స్..
కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఇతర వ్యాధులు ఉన్నవారిపై వైరస్ వేగంగా ప్రభావం చూపుతోందని అంగీకరించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి వెంటనే గుర్తిస్తే ప్రాణ నష్టం జరగకుండా చూడొచ్చని.. ఆలస్యమైతే కష్టమని అభిప్రాయపడ్డారు. ఎవరికైనా జ్వరం వచ్చిన వైద్యారోగ్య సిబ్బందిని వెంటనే సంప్రదించాలని కోరారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎం కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Recommended Video
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో వైరస్ విజృంభిస్తోంది. ప్రజా ప్రతినిధులను కూడా వైరస్ వదలడం లేదు. గత 24 గంటల్లో 1554 మందికి పాజిటివ్ సోకగా.. వైరస్ వచ్చిన 9 మంది చనిపోయారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications