మల్లన్న సాగర్ వివాదానికి ఎండ్ కార్డ్ : హరీశ్ రావు చర్చలు సఫలం
మెదక్ : భూసేకరణ కారణంగా గత కొద్ది రోజులుగా వివాదం రేగుతోన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయినట్టుగా సమాచారం. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో నిర్వాసితులతో జరుపుతోన్న చర్చలు సఫలం కావడంతో, ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు అక్కడి రైతులు ఒప్పుకున్నారు.
తాజా చర్చల్లో భాగంగా.. ముంపు గ్రామాల బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు వల్ల కోల్పోయే భూములకు ఎకరా రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని నిర్వాసితులకు హరీశ్ రావు హామి ఇచ్చారు.

నిర్వాసితులను అన్ని విధాలుగా అండగా నిలబడుతామని చెప్పిన హరీశ్, ప్రాజెక్టు వల్ల ఎక్కువగా నష్టపోతున్న ఏటిగడ్డ, క్రిష్టాపూర్ గ్రామస్తులకు మరో చోట కొత్త గ్రామాన్ని కట్టి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని నిర్వాసితులకు భరోసా కల్పించారు.
కొత్త గ్రామం నిర్మించిన తర్వాత ప్రభుత్వమే దాని అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటుందని చెప్పిన ఆయన, గ్రామాన్ని ప్రభుత్వమే దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. కాగా, మంత్రి హరీశ్ రావు పూర్తి భరోసా వ్యక్త పరచడంతో.. సంతృప్తి చెందిన రైతులు భూసేకరణకు అంగీకరించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామన్న రైతులందరికీ మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications