హత్యా? ప్రమాదమా?: కారులో వ్యక్తి సజీవదహనం
మహబూబ్నగర్: జిల్లా నవాబ్పేట మండలం జంగమయ్యపల్లి సమీపంలో కారులో ఓ వ్యక్తి సజీవదహనమైన ఘటన మిస్టరీగా మారింది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కారులో ఒకరు సజీవదహనం అయినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, ఆ కారు నెంబర్ టీఎస్-08 ఈయూ-1120. ఆ కారును హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మద్యం వ్యాపారికి సంబంధించిందిగా గుర్తించారు. కారు దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మృతదేహం ఆనవాలు పట్టలేని విధంగా కాలిపోవడం.. పైగా మంటలు ఎగిసిపడినప్పుడు కనీసం తప్పించుకునేందుకు ప్రయత్నం కూడా చేయనట్లు గుర్తులు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని కారులో పెట్టి తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ కారును హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మద్యం వ్యాపారికి సంబంధించిందిగా గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications