దారుణం: 15వేల కోసం స్నేహితుడిని చంపి ముక్కలు చేసిన మిత్రులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగిలో దారుణం చోటు చేసుకుంది. ముఫ్తార్ అనే వ్యక్తిని ముగ్గురు స్నేహితులు అత్యంత పాశవికంగా ముక్కులు ముక్కులుగా నరికి చిగురుపల్లి దగ్గర బావిలో పడేశారు. రూ. 15 వేల కోసం ముఫ్తార్ను స్నేహితులే హత్య చేశారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నారాయణపూర్కు చెందిన ముఫ్తార్ ఐదు రోజుల క్రితం ముక్తార్ అదృశ్యమయ్యాడు. బాధితుడి కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా ముక్తార్ స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
ఈ విచారణలో అదృశ్యమైన ముఫ్తార్ను చిగురాలపల్లి వద్ద బావిలో పడేసినట్లు స్నేహితులు తెలిపారు. డబ్బులు ఇస్తామని పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డారు. ముఫ్తార్ తన స్నేహితుడి వద్ద సంవత్సరం క్రితం రూ. 15వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పును తిరిగి చెల్లించడక పోవడంతోనే ఈ దారణానికి ఒడిగట్టారు.
ముఫ్తార్కు ఎవరైతే అప్పు ఇచ్చారో అతనితో పాటు మరో ముగ్గురు కలిసి మద్యం మత్తులో ముఫ్తార్ను ముక్కులు ముక్కులుగా చంపి బావిలో పడేశామని పేర్కొన్నారు. బావి వద్దకు చేరుకున్న పోలీసులు, స్ధానికుల సాయంతో మృతదేహానికి సంబంధించిన బయటకు తీసేందుకు ప్రయత్నాలను చేపట్టారు.