విద్యుత్ స్తంభం మీద పడి వ్యక్తి దుర్మరణం (ఫోటో)
హైదరాబాద్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభం మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది.

ఇన్స్పెక్టర్ సత్తయ్య కథనం ప్రకారం ఆర్టీసీ కాలనీకి చెందిన లక్ష్మణ్ (60) రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. అయితే, సోమవారం మధ్యాహ్నాం తన స్కూటర్ను స్థానికంగా ఉన్న మెకానిక్ షాపులో బాగుచేయమని ఇచ్చి రోడ్డుగుండూ నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు.

ఆర్టీసీ కల్లు కాంపౌండ్ వద్దకు రాగానే ఒక్కసారిగా సిమెంట్ విద్యుత్ స్తంభం విరిగి లక్ష్మణ్ మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి పంపించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications