ముంబైలో చిక్కాడు: ‘హార్లీ డేవిడ్సన్’ బైక్ దొంగని పట్టించిన సెల్ఫోన్ సిగ్నల్స్
హైదరాబాద్: టెస్ట్డ్రైవ్ పేరుతో హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని హార్లీ డేవిడ్సన్ షోరూంలో ఖరీదైన బైక్తో పారిపోయిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడిని ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈనెల 1న బంజారాహిల్స్లోని హార్లీ డేవిడ్సన్ షోరూంలో ఆరు లక్షల విలువైన వాహనాన్ని ట్రయల్ రన్ చూస్తానని చెప్పి బైక్తో పరారైన సంగతి తెలిసిందే. షోరూం నిర్వహకుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అతడు భీమవరానికి చెందిన తుర్లపాటి కిరణ్ అని, ఓఎన్జీసీలో సబ్మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడు హైదరాబాద్ సైనిక్పురిలో ఉంటున్నాడు. అతడి తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి ప్రకాశరావు. కిరణ్ను పూర్తిస్థాయిలో విచారించేందుకు ముంబైలోనే ఉంచారు. శుక్రవారం ఉదయం అతడిని హైదరాబాద్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

హార్లీ డేవిడ్సన్ బైకు గురించి క్షుణ్ణంగా ముందుగానే అన్ని తెలుసుకుని మరీ కొట్టేసినట్లు తెలిసింది. హార్లీ డేవిడ్సన్ బైక్ లీటరుకు 12 కిలోమీటర్లు వస్తుందని ముందే తెలుసుకున్న కిరణ్, ఏ విధంగా చోరీ చేయాలని పక్కా ప్రణాళిక రచించుకున్నాడు.
ముందుగా బైక్ కొట్టేసేందుకు ఇరవైవేలు సమకూర్చుకున్నాడు. ఒకసారి ట్యాంకు నింపితే 150 కిలోమీటర్లు పోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లతో చోరీ చేశాడు. సాగర్సొసైటీలోని షోరూంనకు వెళ్లకముందు ముంబైకి ఓ ఫోన్ చేశాడు. అదే ఇప్పుడు అతడిని పట్టించింది.
ముందుగా శామీర్పేట సమీపంలోని ఓ పెట్రోల్ బంక్లో పెట్రోలు కొట్టిచ్చినట్లు పోలీసులకు సీసీ ఫుటేజీ దొరికింది. ఆ తర్వాత కరీంనగర్ హైవే మీదుగా సదాశివపేట చేరుకున్నాడు. అక్కడ హీరో హోండా షోరూంలో హెల్మెట్ కొనుగోలు చేశాడు. తర్వాత సదాశివపేట శివారు ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నట్టు విచారణలో తేలింది.
ఆ తర్వాత ఓ ప్రత్యేక బృందంగా ఏర్పడి ముంబైకి వెళ్లారు. అక్కడి శివారు ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications