అక్రమ సంబంధమని హత్య: భర్తనే.. (ఫొటోలు)
కరీంనగర్: కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్-కొత్తకొండ రహదారిలో మంక్యానాయక్ తండా శివారులో మంగళవారం ఉదయం గుగ్లోతు రజిత(30) దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని హుస్నాబాద్ సీఐ గడ్డం సదన్కుమార్, ముల్కనూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ సత్యనారాయణ పరిశీలించారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మం డలం వేలేరు హామ్లెట్ మిరపకుంట తండాకు చెందిన రజితకు హుస్నాబాద్ మండలం జిల్లెల్ల గడ్డ కు చెందిన గుగ్లోతు రమేశ్తో 15ఏళ్ల క్రితం వివా హమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.

నాలుగు నెలల క్రితం గుగ్లోతు రజితకు మీర్జాపూర్ గ్రామ హామ్లెట్ పుల్నాయక్ తండాకు చెందిన లవుడ్య నీమతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడగా, రెండునెలల క్రితం అతనితో వెళ్లిపోయింది. తన భార్య కనిపించడం లేదని రజిత భర్త రమేశ్ హుస్నాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దానిపై కేసు నమోదైంది. పోలీసులు, బంధువులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో రమేశ్ తన భార్య రజితను తిరిగి కాపురానికి తీసుకెళ్లా డు.

కొన్ని రోజులుగా రజిత మళ్లీ నీమని కలుస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య తగాదా ఏర్పడింది. తన భార్య ఇక మారదనుకున్న రమేశ్ మంగళవారం వేకువజామున తన బైక్పై అత్తారిల్లు మిరపకుంట తండాకు తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పదునైన ఆయుధంతో రజిత మెడపై నరికినట్లు తెలుస్తున్నది. రజిత కళ్లద్దాలు విరిగిపోవడంతోపాటు మృతదేహాన్ని లాక్కెళ్లి మెడపై నరికినట్లు సంఘటనా స్థలం వద్ద ఆనవాళ్లున్నాయి. రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలానికి రజిత తల్లిదండ్రులతోపాటు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. హత్య తర్వాత రమేశ్ ములుకనూ రు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఆమె బైక్పై నుంచి ప్రమాదవశాత్త్తూ కింద పడి చనిపోయింద ని చెప్పాడు. రజితను భర్త రమేశ్ చంపాడా? లేక ఏదైనా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామని సీఐ సదన్కుమార్ తెలిపారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications