Crop loss compensation: పంట నష్టం పరిహారం విడుదలంటూ ప్రకటన.. ఇంకా అందని నిధులు..!
తెలంగాణలో పలు జిల్లాల్లో వడగళ్ల వానలు పడి పంటలు నష్టపోయాయి. మార్చి 16 నుంచి 24 మధ్య కామారెడ్డి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షం కారణంగా పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయిందో నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది.
ప్రభుత్వం ఆదేశంతో వ్యవసాయ అధికారులు సర్వే చేసి 15, 814.03 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం ఎకరానికి రూ. 10 వేల చొప్పున 15 కోట్ల 81 లక్షల 41 వేల రూపాయలను రైతులకు పరిహారంగా మంజూరు చేస్తూ ఆర్థికపరమైన అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది రైతులకు పంట నష్టపరిహారం అందలేదు. కేవలం కొంత మందికి మాత్రమే అందినట్లు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

కామారెడ్డి జిల్లాల్లో 10,328 ఎకరాల్లో పంట నష్టపోగా.. 9,107 రైతులకు పరిహారం రావాల్సింది. నిజామాబాద్ జిల్లో 1,652 ఎకరాల్లో పంట దెబ్బతినగా 1,809 రైతుకు పరిహారం చెల్లించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,014 ఎకరాలకు గానూ 1,036 రైతులు, సిద్దిపేట జిల్లాలో
746 ఎకరాలకు గానూ 793 మంది రైతులకు, మెదక్ జిల్లాలో 714.17 ఎకరాలకు గానూ 957 రైతులకు, ఆదిలాబాద్ జిల్లాలో
545 ఎకరాలకు గానూ 370 రైతులకు పరిహారం అందాల్సి ఉంది.
ఇక నిర్మల్ జిల్లాలో 332 ఎకరాలకు సంబంధించి 519 రైతులు, మంచిర్యాల జిల్లాలో 244 ఎకరాలకు గానూ 376 మంది రైతులకు, కరీంనగర్ జిల్లాలో 160 ఎకరాలకు సంబంధించి 160 మంది అన్నదాతలకు, సంగారెడ్డి జిల్లాలో 76 ఎకరాలకు గానూ 119 రైతులకు పంట నష్టపరిహారం రావాల్సి ఉంది.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications