Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర.. ఆశ్చర్యకర విషయాలు!

మేడారం మహా జాతర ... ప్రపంచంలోనే ఆదివాసీలు జరుపుకునే అతిపెద్ద మహా జాతర ఇంకొకటి లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అటువంటి మహా జాతర తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైన అటవీప్రాంతంలో జరుగుతుంది. గిరిజనులు, ఆదివాసీలు, అతి సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు ఎక్కువగా తరలివచ్చే ఈ జాతరలో ప్రతిదీ విశేషమే.ములుగు జిల్లాలోని మేడారంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర ప్రతి ఒక్కరికి ఒక పులకింత.

మేడారం జాతర ఇలా

ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల నుండి కోట్లాదిమంది భక్తజనం తరలివచ్చి తల్లులను దర్శించుకుంటారు అంటే సమ్మక్క, సారలమ్మల మహత్యం ఎంతటిదో అర్థమవుతుంది. నాలుగు రోజుల పాటు సాగే మేడారం జాతరలో జనవరి 28వ తేదీన కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెల మీదికి తీసుకువస్తారు. 29వ తేదీన చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దె మీదకు తీసుకువస్తారు. ఇద్దరు మేడారం చేరుకోవడంతో జాతర ఊపందుకుంటుంది.

medaram jathara 2026 significance rituals history and the secrets of sammakka saralamma jathara

మేడారం జాతర చరిత్ర

అసలు మేడారం మహా జాతరకు ఎందుకు ఇంత ప్రాశస్త్యం? మేడారంలో కొలువైన ఈ సమ్మక్క సారలమ్మలు ఎవరు? వారి చరిత్ర ఏమిటి? అంటే 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించిన ఆదివాసి దొర మేడరాజు. ఆయన ఏకైక కుమార్తె సమ్మక్కను, మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ మరియు జంపన్న అనే ఇద్దరు సంతానం.

మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండయాత్ర

కాకతీయులకు చెల్లించాల్సిన కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. దాడిని తట్టుకోలేక మేడరాజు మేడారం వెళ్లి అజ్ఞాతవాసం గడుపుతాడు. మేడారం పాలకుడు పగిడిద్దరాజు కూడా కరువు కారణంగా కప్పం కట్టలేకపోతాడు. అంతే కాదు మేడరాజుకు ఆశ్రయం కల్పించాడన్నది, తిరుగుబాటు భావాలు పెంచుతున్నాడన్న ఆరోపణలతో ప్రతాపరుద్రుడు ఆగ్రహించి, తన మంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.

కాకతీయులతో పోరాడిన ధీర చరితలు

సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడినా, అపార కాకతీయ సేనల ముందు ఓడిపోతారు.ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందుతారు.ఈ వార్త విన్న జంపన్న, అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది.

తల్లీ కూతుళ్ళ ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ గిరిజనుల జాతర

అపర కాళిలా కాకతీయులపై విరుచుకుపడిన సమ్మక్క కాకతీయుల వెన్నుపోటుతో చిలకలగుట్ట పైకి వెళ్లి అంతర్దానమయ్యింది. అప్పటి నుండి ఆ తల్లి, కూతుళ్ళ ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ గిరిజనులు మేడారం జాతర నిర్వహిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం మేడారం జాతరను అధికారిక పండుగగా నిర్వహిస్తుంది అంటే ఆ తల్లుల మహత్యం తెలుసుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+