కేపీహెచ్బీలో భూ ప్రకంపనలు?: పరుగులు తీసిన జనం
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయనే వదంతులు వ్యాప్తి చెందడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
మంగళవారం రాత్రి సుమారు 8గంటల సమయంలో జేఎన్టీయూ రోడ్డు ఉన్న 18అంతస్తుల మంజీరా ట్రినిటీ కార్పొరేషన్ భవనంలోని 8వ అంతస్తులో ప్రకంపనలు వచ్చాయంటూ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భయభ్రాంతులకు గురై కిందికి పరుగులు తీశారు. రేడియో మిర్చి కార్యాలయం నుంచి కూడా ఉద్యోగులు కిందికి పరుగులు పెట్టారు.

ఆ తర్వాత 15, 16 అంతస్తులలో కూడా ప్రకంపనలు వచ్చాయంటూ పలువురు ఉద్యోగులు కిందకి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భవనం సెక్యూరిటీ సిబ్బంది.. ప్రకంపనలు రావడం అంతా పుకార్లేనని, వీటిని ఎవరూ నమ్మవద్దని తిరిగి ఉద్యోగులను భవనంలోకి పంపారు.
ప్రకంపనల సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మహేష్.. ఆ భవనం వద్దకు చేరుకుని విచారించారు. పరిసరాలను పరిశీలించారు. భవనంలో ప్రకంపనలు ఏమీ రాలేదని, అవన్నీ పుకార్లేనని భవన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులుకు తెలిపారు. కాగా, ఇటీవల కూకట్పల్లి ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు చోటు చేసుకోవడం గమనార్హం.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications