నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఎంఐఎం నేతల అరెస్ట్, రిమాండ్!!
నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంఐఎం కౌన్సిలర్లు, కార్యకర్తలు పట్టణ ప్రగతి ఎక్కడ జరిగిందో చూపించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణ కు దిగిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ను సైతం వారు టార్గెట్ చేశారు.
రెంజల్ బేస్, రాకాసి పేట కాలనీల్లో పట్టణ ప్రగతి లో పాల్గొన్న ఎం.ఎల్.ఏ. షకీల్ ను నిన్న ఎం.ఐ.ఎం. కౌన్సిలర్లు అడ్డుకున్నారు. తనను అడ్డుకున్న సమయంలో వారి వద్ద మారణాయుధాలు కనిపించాయని ఎమ్మెల్యే షకీల్ పోలీసులను ఆశ్రయించారు. బోధన్ ఎంఐఎం కౌన్సిలర్స్, కార్యకర్తలపై ఎమ్మెల్యే షకీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంఐఎం కౌన్సిలర్లు, కార్యకర్తలు తనను చంపటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కారుని అడ్డుకుని గ్రూప్ గా ఏర్పడి మారణాయుధాలతో చంపటానికి వచ్చారని పేర్కొన్నారు. ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎంఐఎం కౌన్సిలర్లు అల్తాఫ్, నావిధ్, మరో 8 మంది కార్యకర్తలపై 307,324,341,R/W 34 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వారిని అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరు పరిచారు. జడ్జి గారికి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అయితే తమపై అనవసరంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఎంఐఎం కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో ఎంఐఎం కార్యకర్తలు జడ్జి ముందుకు చేరుకున్నారు. నిజామాబాద్ లో ఎంఐఎం కౌన్సిలర్ లకు రిమాండ్ విధించారు.
ఇక తాజా పరిణామాలతో బోధన్ లో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల మధ్య దూరం పెరుగుతుంది. ఇక ఈ విషయాన్ని ఎంఐఎం నేతలు అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ క్రమంలో రేపు అసదుద్దీన్ ఓవైసీ బోధన్ వెళ్లనున్నారు. ఈ పరిణామాలతో ముందు ముందు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నది తెలియాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications