మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్... ఆ కుటుంబానికి ఆర్థిక సాయం...
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతేడాది నవంబర్లో ఆత్మహత్యకు పాల్పడిన ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆయన ఆదుకున్నారు. ఐశ్వర్య తల్లిదండ్రులను ప్రగతి భవన్కు పిలిపించి వారికి రూ.2.50లక్షలు అందజేశారు. అంతేకాదు,ఆ కుటుంబం ఉంటున్న షాద్నగర్లో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ అందించిన సాయానికి ఐశ్వర్య రెడ్డి కుటుంబం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.
ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతూ సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న ఐశ్వర్య గతేడాది నవంబర్లో ఆత్మహత్యకు పాల్పడింది. షాద్నగర్కు చెందిన ఐశ్వర్య ముందు నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆమెకు సీటు లభించడంతో తల్లిదండ్రులు తమ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2లక్షలు తీసుకొచ్చారు. అలా ఆమెను బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులో చేర్పించారు.

గతేడాది లాక్డౌన్ కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ మూసివేయడంతో ఆమె ఇంటికి వచ్చింది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఆమె వద్ద ల్యాప్ టాప్ లేదు. మొబైల్ ఫోన్లోనే ఆన్లైన్ క్లాసులు వినేది. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అయినా కొనివ్వాలని తండ్రి కోరితే కొన్నిరోజులు ఆగమన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు దినసరి కూలీలు... లాక్డౌన్ కారణంగా వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఓవైపు ఇంటి ఖర్చులు... మరోవైపు కూతురి చదువు కోసం తీసుకున్న లోన్ రీపేమెంట్ వారికి భారంగా మారింది.
ఈ నేపథ్యంలో కుటుంబానికి తాను భారం కావొద్దని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది.తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో పేర్కొంది. 'నావల్ల మా ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయి. నేను భారం వాళ్లకి.. నా చదువు భారం.నేను చదువు లేకపోతే బ్రతకలేను.చాలారోజుల నుంచి ఆలోచిస్తున్నా. చావే కరెక్ట్ అనిపించింది.కనీసం ఒక సంవత్సరానికైనా నాకు స్కాలర్షిప్ వచ్చేలా చూడండి.అందరూ నన్ను క్షమించండి.' అంటూ సూసైడ్ నోట్ రాసింది. ఆమె ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.చదువుకునే స్తోమత లేకపోవడం వల్ల ఒక విద్యార్థిని ఇలా ఆత్మహత్యకు పాల్పడాల్సి రావడం అత్యంత విషాదకరమనే చెప్పాలి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications