MeeSeva Operators: మీ సేవ ఆపరేటర్లకు గుడ్ న్యూస్..!
రాష్ట్రంలోని మీ సేవ ఆపరేటర్లకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మీసేవ ఆపరేటర్లకు మద్దతుగా సంక్షేమ బోర్డును చురుకుగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 4,754 మీసేవ కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి శాశ్వత ఉపాధిని పొందేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. మీసేవా ఆపరేటర్ల కోసం 14వ వార్షిక కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలు అమలు చేస్తుందన్నారు.
ముఖ్యంగా 6 హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ప్రభావం ఉండేలా దశలవారీగా ఈ హామీలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 2011లో ప్రారంభించిన ఆన్లైన్ సేవ, ప్రజలు మండల లేదా జిల్లా కార్యాలయాలను సందర్శించకుండా ప్రభుత్వ సేవలను మరింత సులభంగా పొందడంలో ఉపయోగపడిందని గుర్తు చేశారు. త్వరలో మీసేవా కింద మరిన్ని సేవలను జోడించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. మీ సేవను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తామన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలన తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయిందని శ్రీధర్ బాబు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందన్నారు. ఆర్థిక స్థిరత్వంతో దూసుకుపోతోందని వివరించారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని కోరారు. మీసేవా ఆపరేటర్లు అంకితభావం పని చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ బోర్డు ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, మీసేవ సిబ్బందికి శాశ్వత పాత్రలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టెక్నాలజీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, మీసేవ కమిషనర్ రవికరణ్, మీసేవ సంఘం ప్రతినిధులు శంకర్, అబ్దుల్ మహ్మద్, బాలరాజు, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications