కేటీఆర్ కాదు.. ఆయన జేజీఆర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి సెటైర్లు
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కేటీఆర్ మళ్లీ అనాలోచితంగా మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కక్కుర్తి పడి, ప్రాజెక్టులు కట్టారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ చర్యలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే లోపాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు.

కేటీఆర్ తన పేరును జోసెఫ్ గోబెల్స్ రామారావు(జేజీఆర్)గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిసారీ అసత్యపు మాటలతో జనాన్ని నమ్మించాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవం ఎంటో ప్రజలందరికి తెలుసని చెప్పారు.
ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతిరోజు సమీక్షలు జరుపుతున్నామని యుద్ధ ప్రాతిపదికన నిర్మస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏటా ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కోసం కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ బడ్జెట్పై కొంత స్పష్టత రావటం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ రూ.10,820 కోట్ల పనులపై ఖర్చుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ పనులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీర్ల అందరితో సమీక్షించామన్నారు. వర్షాకాలం కాబట్టి నీటిపారుదల శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల విషయంలో స్పష్టమైన వైఖరీతో ఉన్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల మరమ్మతులకు నిపుణుల సలహాలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. నిర్మాణంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లీస్తామని తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications