హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో అదృశ్యమై, ముంబైలో ప్రత్యక్షమై...

By Pratap
|
Google Oneindia TeluguNews

Missing Hyderabad girls found in Mumbai
హైదరాబాద్: హైదరాబాదులోని రామంతాపూర్‌లో అదృశ్యమైన ఇద్దరు బాలికలు ముంబైలో ప్రత్యక్షమయ్యారు. కలకలంరేపిన ఈ సంఘటన ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.

రామంతాపూర్ సత్యనగర్‌లో నివసిస్తున్న దిల్వార్ కూతురు ఇమ్రాన్‌బేగం (12), నేతాజీనగర్‌లో నివసిస్తున్న హారిఫ్ కూతురు ఫాతిమా (12) స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరు శనివారం ఇంట్లో నుండి స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు.

దీంతో కంగారుపడ్డ వారి తల్లిదండ్రులు బిడ్డలకోసం స్నేహితులు, బందువుల ఇళ్లలో గాలించినా ప్రయోజనంలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే ఇంతలోనే ఆదివారం ఉదయం ముంబయిలో ప్రత్యక్షమైనట్లు సమాచారం వచ్చింది.

ఎవరో ఆటోలో వచ్చి తీసుకెళ్లారని అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పినట్లు తెలిసింది. ముంబై నుండి హైదరాబాద్‌కు వారిని తీసుకురావడానికి ఉప్పల్ పోలీసులు వెళ్లారు.

English summary
Two Hyderabad girls found in Mumbai in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X