మియాపూర్ భారీ స్కాం: ఇంద్రాణితో పాటు గోల్డ్స్టోన్ ప్రసాద్ పరార్
మియాపూర్ భూకుంభకోణం కేసులో నిందితులకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణం కేసులో నిందితులకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కుటుంబంతో సహా గోల్డ్ స్టోన్ ప్రసాద్ పరార్
మియాపూర్ లో వెలుగుచూసిన భూకుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ హస్తం ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయన కుటుంబంతో సహా పరారయ్యాడు.
ప్రసాద్ ఆచూకీ లభ్యం కాకపోవడం, ఆయనతో సహా ఆయన కుటుంబీకుల ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

ఆయన ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు ఓ అధికారి తెలిపారు. ఈ కేసులో భాగంగా ప్రసాద్, ఆయన భార్య ఇంద్రాణి, కోడలు మమతలపై కేసులు నమోదు చేశారు.
వారు వెంటనే పోలీసుల ముందుకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రసాద్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఎల్బీనగర్, మైలార్ దేవ్ పల్లి, బాలానగర్ ప్రాంతాల్లో జరిగిన భూముల క్రయ విక్రయాల్లో అవకతవకలు జరిగాయని, వాటి వెనుక ప్రసాద్ హస్తం ఉన్నట్టు సాక్ష్యాలు లభించాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక ఆయన విదేశాలకు పారిపోకుండా నేడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications