MLC Kavitha బెయిల్ కోసం మోడీ పరీక్షా పే చర్చ.. ఏం వాదనబ్బా ఇది!!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత తనకు బెయిల్ కావాలని రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణలో కవిత తరపు న్యాయవాదులు వాదించిన తీరు, మోడీ ప్రస్తావన తెచ్చి వారు చెప్పిన విషయాలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.
కవిత బెయిల్ వాదనలో మోడీ ప్రస్తావన
కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరపున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మానవతాకోణంలో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని కోర్టులో ప్రస్తావించారు. పిల్లలకు పరీక్షల పట్ల భయం పోగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.

మోడీ లెక్చర్ లను ప్రస్తావిస్తూ వాదన
పరీక్షల సన్నద్దతపై ప్రధాని మోడీ చాలా సందర్భాలలో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తూ లెక్చర్లు ఇచ్చారని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలని, ఈ విషయాన్ని ప్రధాని మోడీ సైతం తన ప్రసంగాలలో చెప్పారని పేర్కొన్నారు. తల్లిని అరెస్టు చేస్తే ఆ ప్రభావం తనయుడిపై ఉంటుందని, తండ్రి తల్లి కోసం న్యాయపోరాటం చేయడంలో బిజీగా ఉన్నాడన్నారు.
కవితకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి
ఫలితంగా కవిత కొడుకు పరీక్షలను సరిగా రాయలేడని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు . తల్లి పరిస్థితి ఇలా ఉంటే కొడుకు పరీక్షల మీద శ్రద్ధ పెట్టలేడని, కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పరీక్షల భయం లో ఉన్న కవిత కుమారుడి కోసం ఆమెకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అవాక్కయ్యేలా కవిత తరపు న్యాయవాది లాజికల్ వాదన
ఒక మహిళగా, ప్రజాప్రతినిధిగా ఆమె బెయిల్ పొందవచ్చని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించి కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో, తల్లికి బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మొత్తానికి కవిత తరపు న్యాయవాది వాదన మాత్రం ఇది తెలిసిన ప్రతీ ఒక్కరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏం లాజిక్ భయ్యా అనుకునేలా చేసింది.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications