మహిళలు ముందుండాలి, ఎర్రజెండా సంఘాలు బద్నాం చేస్తున్నాయి: కవిత(పిక్చర్స్)
హైదరాబాద్: ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళా ఉద్యోగులకు రక్షణగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల సెల్ ఏర్పాటుతోపాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్ సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని హామీ ఇచ్చారు.
శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో టీఎన్జీవో ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ విజయంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ఉద్యోగులు తమవంతు బాధ్యత నిర్వర్తించాలని, ఇందులో మహిళా ఉద్యోగులు ముందుండాలని పిలుపునిచ్చారు. దశలవారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులను సంపూర్ణ భాగస్వాములను చేసిన టీఎన్జీవో ఉద్యోగ సంఘం పేరు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కొనియాడారు. పురుషులతో సమానంగా ఆ రోజు మహిళా ఉద్యోగులు, యూనివర్సిటీల్లో విద్యార్థినులు తెలంగాణ కోసం తెగించి పోరాడారని గుర్తుచేశారు.
అలాంటి ఉద్యోగులను గౌరవించుకోవడం ఉద్యమ పార్టీ బాధ్యత అయినందుకే, టిటీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగవర్గాలతో ఫ్రెండ్లీగా ఉంటున్నదని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీని ప్రకటించడమే దీనికి నిదర్శనమన్నారు.
ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఎర్రజెండాల సంఘాలు కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని ఎంపీ కవిత మండిపడ్డారు. ఆశ వర్కైర్లెనా, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలైనా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని స్పష్టంచేశారు.
మహిళా ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను చెల్లింపులో మినహాయింపు ఇచ్చేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులపై వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్సెల్స్ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. వచ్చే నెల 23,24 తేదీల్లో వరంగల్లో జరిగే అఖిల భారత మహిళా ఉద్యోగుల సదస్సును విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.
తద్వారా తెలంగాణ పతాకాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించాలని సూచించారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చే 28 రాష్ర్టాల ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రం తరఫున అతిథి, సత్కారాలు ఘనంగా ఉండాలని, అవసరమైన సహకారం ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసేలా కృషిచేస్తానని తెలిపారు.

ఎంపి కవిత
ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు.

ఎంపి కవిత
మహిళా ఉద్యోగులకు రక్షణగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల సెల్ ఏర్పాటుతోపాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్ సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఎంపి కవిత
శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో టీఎన్జీవో ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ విజయంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు.

ఎంపి కవిత
బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ఉద్యోగులు తమవంతు బాధ్యత నిర్వర్తించాలని, ఇందులో మహిళా ఉద్యోగులు ముందుండాలని పిలుపునిచ్చారు. దశలవారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

ఎంపి కవిత
ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులను సంపూర్ణ భాగస్వాములను చేసిన టీఎన్జీవో ఉద్యోగ సంఘం పేరు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కొనియాడారు.

ఎంపి కవిత
పురుషులతో సమానంగా ఆ రోజు మహిళా ఉద్యోగులు, యూనివర్సిటీల్లో విద్యార్థినులు తెలంగాణ కోసం తెగించి పోరాడారని గుర్తుచేశారు.

ఎంపి కవిత
అలాంటి ఉద్యోగులను గౌరవించుకోవడం ఉద్యమ పార్టీ బాధ్యత అయినందుకే, టిటీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగవర్గాలతో ఫ్రెండ్లీగా ఉంటున్నదని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీని ప్రకటించడమే దీనికి నిదర్శనమన్నారు.

ఎంపి కవిత
సదస్సులో టీఎన్జీవో సం ఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రేచల్, కన్వీనర్ విజయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications