వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో చెప్పలేం: ముఖేష్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.
గోషా మహల్ నియోజకవర్గంలో తాను కాకుండా ఎవరు బరిలో ఉన్నా ఉపయోగం లేదన్నారు. తన కుమారుడికి పోటీ చేయాలనే ఆసక్తి ఉంటే టిక్కెట్ కోరుతానని చెప్పారు.
తాను తెలంగాణను వ్యతిరేకించలేదని చెప్పారు. హైదరాబాదును దక్షిణ భారత దేశ రాజధాని చేయాలని కోరానని చెప్పారు. ఇదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. 2018లో రాజకీయం రంజుగా ఉంటుందన్నారు. ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో చెప్పలేమన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
Comments
English summary
Former Minister Mukesh Goud interest comments on politics.