కొండా సురేఖ క్షమాపణలు.. నాగార్జున కీలక నిర్ణయం..
మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున కేసు ఉపసంహరించుకున్నారు. ఇటీవల నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో పరువునష్టం కేసును విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు.
అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలపై తాను చింతిస్తున్నానని ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
" అక్కినేని నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలన్న ఉద్దేశంతో చేయలేదు. నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా వారి పరువుకు భంగం కలిగించాలన్న ఉద్దేశం నాకు లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు జరిగితే దానికి చింతిస్తున్నాను. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను" అని కొండా సురేఖ తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా క్షమాపణ చెప్పారు.

గతంలో కేటీఆర్ పై విమర్శలు చేసిన సందర్భంలోనే నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున కుటుంబం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. అయితే తాజాగా ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications