నాగార్జున ఫాంహౌస్లో విషాదం: దంపతుల మృతి
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రం(ఫాంహౌస్)లో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ఘాతంతో ఓ దంపతులు మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు(36), దుర్గ(32) దంపతులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ శివారులో గల నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయడం ఏర్పడటంతో పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. తెగిపడిన విద్యుత్ తీగను గమనించకుండా తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా.. అతడ్ని కాపాడే ప్రయత్నంలో భార్య దుర్గ కూడా విద్యుత్ షాక్కు గురైంది. దీంతో భార్యాభర్తలు అక్కడే ప్రాణాలు విడిచారు. ఇద్దరి మరణంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications