హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమెనే పెళ్లి చేసుకున్న హరికృష్ణ: వస్తానో రానో.. హోటల్ నుంచి వెళ్తూ వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

నందమూరి హరికృష్ణ వివాహ జీవిత విశేషాలు

హైదరాబాద్: నందమూరి హరికృష్ణకు ఇద్దరు భార్యలు, నలుగురు సంతానం. భార్యల పేర్లు లక్ష్మీ, షాలిని. జానకిరామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కొడుకులు. సుహాసిని కూతురు. హరికృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

హరికృష్ణ ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే!హరికృష్ణ ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే!

హరికృష్ణ మొదటి భార్య లక్ష్మీ ఆయన క్లాస్‌మేట్. తన క్లాస్‌మేట్‌నే ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమెది కూడా నిమ్మకూరే. మరో భార్య షాలిని... జూనియర్ ఎన్టీఆర్ తల్లి.

శివుడిని ఎక్కువగా ఆరాధించేవారు

శివుడిని ఎక్కువగా ఆరాధించేవారు

హరికృష్ణ శివుడిని ఎక్కువగా ఆరాధించేవాడు. నల్గొండ జిల్లాలోని శివాలయాలకు తరుచూ వెళ్తుండేవారు. దాదాపు నెల రోజుల క్రితమే ఓసారి అక్కడి శివాలయానికి వెళ్లి వచ్చారు. ఆయనకు ఈ రోడ్డు పరిచయమే. అయితే అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, తలకు తీవ్ర గాయాలు కావడం వంటి కారణాలతో మృతి చెందారు.

సమైక్యాంధ్ర కోసం రాజ్యసభకు రాజీనామా

సమైక్యాంధ్ర కోసం రాజ్యసభకు రాజీనామా

హరికృష్ణ టీడీపీ ఆవిర్భావం నుంచి ముఖ్యనేతగా ఉన్నారు. ఎన్టీఆర్ చైతన్యరథానికి సారథిగా ఉన్నారు. వేలు, లక్షల కిలోమీటర్లు నడిపిన అనుభవం ఉంది. 1996లో ఎమ్మెల్యేగా గెలిచారు. రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2008లో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

శోక సముద్రంలో నందమూరి కుటుంబం

శోక సముద్రంలో నందమూరి కుటుంబం

హరికృష్ణ మృతి నేపథ్యంలో నందమూరి కుటుంబం శోకసముద్రంలో ఉంది. హరికృష్ణను కడసారి చూసేందుకు ఆయన భార్య షాలిని, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి, సోదరి పురంధేశ్వరి, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల మంత్రులు, పలువురు ప్రముఖులు వచ్చారు.

నిమ్మకూరుతో వారికంటే ప్రత్యేక అనుబంధం

నిమ్మకూరుతో వారికంటే ప్రత్యేక అనుబంధం

హరికృష్ణ మృతి విషయం తెలిసి నిమ్మకూరు గ్రామస్తులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత.. ఆయన పిల్లల్లో నిమ్మకూరుతో ఎక్కువ అనుబంధం ఉంది హరికృష్ణకే అంటున్నారు. ఆయన ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడని, అందరితో కలివిడిగా ఉండేవారని, చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాడని, నిమ్మకూరులో ఉన్న వారిలో చాలామంది పేర్లు హరికృష్ణకు తెలుసునని, ఈ గ్రామంలో ఎన్టీఆర్ తర్వాత.. ఏ ఇల్లు ఎవరిదో తెలిసిన వారు హరికృష్ణ అని చెబుతున్నారు.

హోటల్ సిబ్బందితో అలా చెప్పి వెళ్లిన హరికృష్ణ

హోటల్ సిబ్బందితో అలా చెప్పి వెళ్లిన హరికృష్ణ

హరికృష్ణకు దాదాపు ప్రతి రోజు అబిడ్స్‌లోని తన ఆహ్వానం హోటల్‌కు వెళ్లడం అలవాటు. నిన్న (మంగళవారం) హోటల్ నుంచి బయటకు వస్తూ వస్తానో రానో అని వెళ్లాడని హోటల్ సిబ్బంది చెబుతోంది. హోట్లల్లో 1001 రూం వాస్తు మార్పు చేయించాలని చెబుతుండేవారని గుర్తు చేసుకున్నారు. అయితే దేనికైనా సమయం రావాలి కదా.. అప్పుడే మార్పులు జరుగుతాయని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.

English summary
Telugu Desam Party leader Nandamuri Harikrishna, the fourth son of N T Rama Rao and brother-in-law of Andhra Pradesh CM N Chandrababu Naidu, died in a road accident today near Nalgonda on NH 65.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X