వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రదీప్ చౌదరికి నోటీసు: నోటుకు ఓటు కేసులో నారా లోకేష్ ఇరుక్కుంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నోటీసు అందుకున్న యువ నేత ప్రదీప్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. నోటుకు ఓటు కేసులో నారా లోకేష్ పాత్రపై కూడా ప్రదీప్ చౌదరి నుంచి తెలంగాణ ఎసిబి అధికారులు ఆరా తీస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రదీప్ చౌదరిని సాక్షిగానే ఎసిబి అధికారులు విచారణకు పిలిచారు.

ఈ కేసులో ఇప్పటికే వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌రెడ్డి, ఆయన డ్రైవర్, పని మనిషిలను సాక్షులుగా ఎసిబి విచారించింది. మరో వ్యక్తి జిమ్మిబాబు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కేసు దర్యాప్తునకు సంబంధించి మరో నలుగురు కొత్త వ్యక్తులకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావు అనే నలుగురికి ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేశారు.

వీరిలో ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్‌లు జూబ్లీహిల్స్ టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరులు. ప్రదీప్ చౌదరి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌కు సన్నిహితుడని సమాచారం. దాంతోపాటు వీరు నలుగురు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టిఎన్‌ఎస్‌ఎఫ్ హైదరాబాద్ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని తెలిసింది.

Nara Lokesh follower Pradeep get notice in cash for vote

పుల్లారావు ఉస్మానియా యూనివర్సిటీ టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు. పుల్లారావుది ఖమ్మం జిల్లాగా తెలిసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డిని కూడా విచారణకు హాజరుకావాలని ఎసిబి అధికారులు సమాచారం అందించారు. ఈ మేరకు రాఘవేందర్‌రెడ్డికి గతంలోనే కబురు పంపారు. అయితే అతడు సోమవారం ఎసిబి ముందుకు వస్తున్నట్లు తెలిసింది.

మిగిలిన నలుగురికి సిఆర్‌పిసి సెక్షన్ 160 (సాక్షి) కింద విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని నోటీసులో సూచించారు. సోమవారం ఉదయం 10.30 గంటల కల్లా బంజారాహిల్స్‌లోని ఎసిబి కార్యాలయానికి రావాలని నోటీసులో తెలిపారు. ఓటుకు నోటు కుట్రలో కీలకంగా మారిన డబ్బుకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు వారిని విచారణకు పిలిచినట్లు తెలిసింది.

తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన రూ. 50 లక్షల అడ్వాన్స్ చేరవేతలో వీరి పాత్ర ఉన్నట్లుగా ఎసిబికి సమాచారం అందినట్లు చెబుతున్నారు. అంతేగాక మిగిలిన నాలుగున్నర కోట్లను తమ మనుషుల ద్వారా పంపిస్తానని రేవంత్‌రెడ్డి, స్టీఫెన్‌సన్‌కు చెప్పినట్లుగా వీడియో పుటేజీలో స్పష్టంగా ఉన్న విషయం తెలిసిందే.

రేవంత్‌రెడ్డి చెప్పిన తన మనుషులు ఈ నలుగురే అనేందుకు ఎసిబికి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. అందులో భాగంగానే వారిని సాక్షులుగా విచారణకు పిలిపిస్తున్నట్లు తెలిసింది.ఓటుకు నోటు కేసు దర్యాప్తులో భాగంగా ఎసిబి అధికారులు రెండు రోజుల్లో మరికొందరు ముఖ్యులకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.

English summary
It is said that notice received from Telangana ACB pradeep chowdari is the close associate of Telugu Desam party leader and Andhra Pradesh CM Nara Chandrababu Naidu's son Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X