హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియాంకారెడ్డి హత్యపై నివేదిక కోరిన జాతీయ మహిళా కమీషన్.. సుమోటోగా కేసు విచారణ

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసుపై జాతీయ మహిళా కమీషన్ దృష్టి సారించింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్బయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి హత్యఘటన పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని జాతీయ మహిళా కమీషన్ స్పష్టం చేసింది.

ప్రియాంకా రెడ్డి కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వాన్ని,సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్‌ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ ఓ లేఖ రాసింది. ఇక జాతీయ మహిళా కమీషన్ సైతం కేసు విచారణకు ఓ బృందాన్ని పంపుతున్నట్లు పేర్కొంది.

అంతే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ . ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతారని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
National Womens Commission seeking report on Priyanka reddy murder.. taken the case as suo moto

దేశ వ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్న ప్రియాంకారెడ్డి హత్య కేసులో ఇటు తెలంగాణా పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. దారుణ ఘటనకు కారణమైన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసు శాఖ గుర్తించింది.

ఈ మేరకు నిందితుడి ఫోటోను సైతం మీడియాకు విడుదల చేశారు. ఇది ఇలా ఉంటె ఇప్పటికే ప్రియాంక రెడ్డి హత్య కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది . హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై అన్ని వర్గాలు తీవ్ర నిరసన, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో జాతీయ మహిళా కమీషన్ సైతం విచారణకు కమిటీ వేసి,స్పందించటం గమనార్హం .

English summary
National Women's Commission has directed the Telangana government and relevant authorities to submit a comprehensive report on the priyanka reddy case investigation . The National Women's Commission has written a letter to the Hyderabad DGP. The National Women's Commission also said it would send a team to investigate the case. The National Commission for Women has made it clear that they will fight until the accused is severely punished.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X