వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఓటుకు నోటు'లో లాలూచీపై నాయిని, ఏసీబీయే: బాబుకు నోటీసుపై డీజీపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో తాము ఎవరితోను లాలూచీ పడలేదని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సోమవారం చెప్పారు. రేవంత్ కేసులో లాలూచీ పడ్డట్లుగా కనిపిస్తోందనే విమర్శలు వచ్చాయి.

దీంతో, నాయిని స్పందించారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కారు రాజీపడిందనే ఆరోపణళ పైన ఘాటాగా స్పందించారు. ఆ కేసు విషయంలో తాము లాలూచీ పడే అంశమే లేదన్నారు. ఏసీబీ తన పని తాను చేసుకుపోతోందని, ఆ కేసులో ఎంతటి వారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు.

హైదరాబాద్

ఏసీబీ చూసుకుంటుంది: డీజీపీ

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో చట్ట ప్రకారమే వెళ్తున్నామని డీజీపీ అనురాగ్ శర్మ వేరుగా అన్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఈ కేసును ఏసీబీ చూసుకుంటోందని చెప్పారు. వరంగల్ నగరానికి మరో బెటాలియన్ మంజూరైందని ఆయన తెలిపారు.

వరంగల్‌లో నూతన కమిషనరేట్‌ను నిర్మిస్తామన్నారు. వరంగల్ నగరంలో 5 నూతన పోలీసు స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఫిర్యాదులు తీసుకోకుండా పోలీసులు డబ్బులు అడిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.

చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ న్యూస్ ఛానల్ టీ న్యూస్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బషీర్‌బాగ్ చౌరస్తాలో తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. టీ న్యూస్‌కు ఇచ్చిన నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

English summary
Nayini condemns Congress allegations on Revanth case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X