ఏం జరిగి ఉంటుంది?: అర్థరాత్రి.. ఎర్రగడ్డలో వివాహిత సజీవ దహనం?
హైదరాబాద్: ఎర్రగడ్డలో సౌమ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఆమె నివసిస్తున్న ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో.. చుట్టుపక్కల వారు అప్రమత్తయ్యారు.
వెంటనే ఇంటి తలుపులు పగలగొట్టగా.. ఒంటికి నిప్పంటుకుని మంటల్లో కాలిపోతూ కనిపించింది సౌమ్య. రెండేళ్ల కొడుకు ముందే ఈ అఘాయిత్యం జరగడం వారిని ఆశ్చర్యపరిచింది. బిందెలతో నీళ్లు తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే శరీరమంతా కాలిపోవడంతో ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది.

ఆపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆమె ఒంటిపై కెమికల్ మరకలను గుర్తించారు. సౌమ్య ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. ఇంటి బయట గడియ ఎవరు పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌమ్యది ఆత్మహత్యా?.. లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాగా, సౌమ్యకు విశాఖపట్నంకు చెందిన నాగభూషణంతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఎల్&టీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న అతను.. మంగళవారం రాత్రి 8గం. సమయంలో విధులకు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అర్థరాత్రి సమయంలో సౌమ్య మంటల్లో తగలబడి సజీవ దహనమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్తను, కుటుంబ సభ్యులను విచారించనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications