తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ తనయుడు. ఐటీ, మున్సిపల్, ఎన్నారై వ్యవహారాలు చూస్తున్న మంత్రి కేటీఆర్.. గతంలో పని చేసిన అనుభవాల సాక్షిగా భాగ్యనగరంలో ఐటీ రంగ విస్తరణకు ఇతోధికంగా పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు వారసుడిగా వినూత్నంగా ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో చాలా కీలకంగా ఉన్నారు.
Recommended Video
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని విజేతగా నిలపడంలో కూడా మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్ నగరానికి ఐటీ పరిశ్రమలను తీసుకురావడంలోనూ ఆయన చొరవ చూపుతున్నారు.
తాజాగా, ఆయన లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆయనే దాదాపు అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇటీవల జరిగిన జీఈసీలో కూడా ఆయన సమన్వయకర్తగా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు.