దిల్సుఖ్ నగర్ పేలుళ్లు:యాసిన్ భత్కల్ సహా 5గురికి ఉరిశిక్ష ఖరారు
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితులకు శిక్ష పైన ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నాడు న్యాయస్థానం యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నిందితులకు
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితులకు శిక్ష పైన ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నాడు న్యాయస్థానం యాసిన్ భత్కల్ సహా ఐదుగురు నిందితులకు ఈ శిక్షను విధించింది.
విధ్వంసానికి పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ సభ్యులేనని కోర్టు ఈ నెల 13వ తేదీన నిర్ధారించింది. అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియా ఎర్ రెహమాన్ అలియాస్ వకాస్, తెహసీన్ అక్తర్ అలియాస్ మోనూ, యాసిన్ భత్కల్, ఐజాజ్ షేక్లను నేరస్థులుగా నిర్ధారించి ఉరిశిక్షను విధిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ ఐదుగురు దోషులు హత్య, హత్యాయత్నం, దేశద్రోహం, కుట్ర వంటి అభియోగాలకు సంబంధించి ఐపీసీ 120బీ, 121, 121ఏ, 122, 307, 316, 318, 436, 466, 474, 201 రెడ్ విత్ 34, 109 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 35, ప్రజా ఆస్తుల ధ్వంసం చట్టంలోనిసెక్షన్ 4, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని 16, 17, 18, 19 సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి.

పాకిస్థాన్కు చెందిన వకాస్పై విదేశీయుల చట్టంలోని సెక్షన్ 14, 2 ఆఫ్ 3 కింద నేరం నిరూపణ అయింది. చర్లపల్లి జైలులోని ఎన్ఐఏ న్యాయస్థానంలో తుది వాదనల అనంతరం నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది.
హైదరాబాదులో భద్రత కట్టుదిట్టం
యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఈ రోజు (సోమవారం) న్యాయస్థానం శిక్షను ఖరారు చేయడానికి ముందు హైదరాబాదులో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు నగరం మొత్తం భారీ ఎత్తున మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు.
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో... రియాజ్ భత్కల్ ఏ1 నేరస్తుడు. ఇతను పరారీలో ఉన్నాడు. ఏ2 అసదుల్లా అక్తర్, ఏ3 జియాఉర్ రెహ్మాన్, ఏ4 మహ్మద్ తహసీన్ అక్తర్, ఏ5 యాసిన్ భత్కల్, ఏ6 ఎజాజ్ షేక్లు మిగతా నేరస్తులు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications