అమెరికాలో 'కవిత'చే టీ జాగృతి శాఖ(ఫోటోలు)
హైదరాబాద్: రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ జాగృతి తాజాగా ఉత్తర అమెరికాశాఖను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అమెరికా డెట్రాయిట్లోని ఫార్మింగ్టన్ హిల్స్ మేనర్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరై శాఖను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల ఆశయాలను నిజం చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అమెరికాలోని తెలంగాణ జాగృతి ఇటు తెలంగాణ సమాజానికి అటు అమెరికాలోని ప్రవాస భారతీయ సమాజానికి వారధిగ నిలవాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు ఉన్న అనేకానేక తెలంగాణ సంస్థలను సమనవయ పరుస్తూ ముందు నిలవాలన్నారు. అమెరికాలోని తెలుగు సంస్థలు అందమైన పూలైతే వాటితో పేర్చిన అందమైన బతుకమ్మ జాగృతి అమెరికా శాఖ అన్నారు.
ప్రవాస తెలుగు సంఘాలైన డెట్రాయిట్ తెలంగాణ కమ్యునిటీ, తానా, ఆటా, నాటా, నాట్స్ , తెలంగాణ ఎన్నారై అసోసియేషన్, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధులు శ్రీమతి కవిత గారిని సన్మానించారు. ఈ సందర్భంగా కవిత ఉత్తర అమెరికా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
కార్యవర్గంలో శ్రీధర్ బండారు, సుమంత్ గరకరాజుల, మురళి బొమ్మనవేని, నర్సింగ్రాజ్ గౌలికర్, కిరణ్ గుంటిక, బిందులత, వెంకట్ మంథెన ఉన్నారు. భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత
ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల ఆశయాలను నిజం చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత
ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరుల ఆశయాలను నిజం చేయడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత
ప్రవాస తెలుగు సంఘాలైన డెట్రాయిట్ తెలంగాణ కమ్యునిటీ, తానా, ఆటా, నాటా, నాట్స్ , తెలంగాణ ఎన్నారై అసోసియేషన్, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధులు శ్రీమతి కవిత గారిని సన్మానించారు. ఈ సందర్భంగా కవిత ఉత్తర అమెరికా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఉత్తర అమెరికాలో తెలంగాణ జాగృతి శాఖను ప్రారంభించిన ఎంపీ కవిత
కార్యవర్గంలో శ్రీధర్ బండారు, సుమంత్ గరకరాజుల, మురళి బొమ్మనవేని, నర్సింగ్రాజ్ గౌలికర్, కిరణ్ గుంటిక, బిందులత, వెంకట్ మంథెన ఉన్నారు. భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications