వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైరవీల కోసం తిరగాల్సిన అవసరం లేదు: పారిశ్రామికవేత్తలతో కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పరిశ్రమలకు అనుమతులు పొందడానికి పైరవీలు చేయడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆయన శుక్రవారం పారిశ్రామికవేత్తల మధ్య విడుదల చేశారు. పది, పదిహేను రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు

వంద శాతం అవినీతిరహితంగా పరిశ్రమలకు అనుమతులు లభిస్తాయని, ఈ హామీని తాను ఇస్తున్నానని ఆయన చెప్పారు. తమది అత్యంత సరళమైన పారిశ్రామిక విధానమని ఆయన చెప్పారు. పరిశ్రమల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కృతజ్ఞతలని ఆయన చెప్పారు.

 No corruption in sanctioning industries: KCR

పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు ఇస్తామని ఆయన చెప్పారు. నీరు, విద్యుత్తు, భూమి వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని ఆయన అన్నారు. దేశంలో మూడో వంతు ఫార్మా రంగం తెలంగాణలోనే ఉందని ఆయన చెప్పారు. హైదరాబాదులో ఫార్మా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

 No corruption in sanctioning industries: KCR

పారిశ్రామికవేత్తల అంచనాలను తాము నిరాశపరచబోమని ఆయన చెప్పారు. మహిళలకే కాకుండా అందరికీ పూర్తి స్థాయి భద్రతను హైదరాబాదులో కల్పిస్తామని ఆయన చెప్పారు. లక్షా 15 వేల కెమెరాలతో హైదరాబాదులో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

English summary
Launching New Industrial Policy, Telangana CM K Chandrasekhar Rao assured to the industrialists that there will be no corruption in sanctioning industries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X