కాంతుల్లో మెరిసిన చరిత: అంతలోనే భ్రాంతి..
కాకతీయుల గడ్డ పౌరుషాగ్నులు, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది.. తరతరాలూ గుర్తుంచుకోదగిన ఈ చరిత పుస్తకాలు, కొన్ని సినిమాలకే పరిమితమమయ్యాయి.
వరంగల్: కాకతీయుల గడ్డ పౌరుషాగ్నులు, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది.. తరతరాలూ గుర్తుంచుకోదగిన ఈ చరిత పుస్తకాలు, కొన్ని సినిమాలకే పరిమితమమయ్యాయి.
అదీ అసంపూర్ణమే.. ఓరుగుల్లు నగర చరిత్ర, నాటి రాజుల సాహసోపేత యుద్ధాలు, ఆ నాటి శిల్పకళా వైభవం.. సంస్కృతీ సంప్రదాయాలు... వీటన్నినీ కళ్లకు కట్టినట్లు చూపించడానికి లేజర్ కాంతుల ప్రదర్శనను ప్రభుత్వం ప్రారంభించి, మూన్నాళ్ల ముచ్చటగా మిగిల్చింది.
కాకతీయ ఉత్సవాల సందర్భంగా 2013 డిసెంబర్ 20న రూ. 4 కోట్ల వ్యయంతో వరంగల్ కోటలో ప్రారంభించిన ఈ కాంతుల ప్రదర్శనను (లైట్ అండ్ షో) అప్పటి కేంద్రమంత్రి బలరాంనాయక్, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించారు.
ఈ ప్రదర్శన మూతపడి కొన్ని నెలలైనా మరమ్మతుల్లేవు. కోట వైభవాన్ని తెలుసుకోవాలనే సంకల్పంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రదర్శనలేదని తెలిసి నిరాశ చెందుతున్నారు. మరమ్మతులకు టెండర్లు పిలిచామని, త్వరలో పునః ప్రారంభిస్తామని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ చెబుతున్నారు.