ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కరోనా వైద్యసేవలు.. ప్రతిరోజు 1000 మందికి సాయం
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో బాధితులకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్టీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆన్లైన్లో ఉచిత వైద్య సేవల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకు తగినట్టుగా వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ ద్వారా కరోనా బాధితులకు వైద్య నిపుణులతో సూచనలు, సలహాలు అందించే కార్యక్రమాన్నిప్రారంభించారు.

కరోనా బాధితులకు టెలిమెడిసిన్
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజుకు 1000 మంది కరోనా బాధితులకు ఆన్లైన్ ద్వారా నిపుణులతో వైద్య సలహాలు, సూచనలు అందించేందుకు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి లక్ష్యంగా నిర్దేశించారు. జూమ్ యాప్ ద్వారా ప్రతిరోజూ ఉదయం గం.7:30 ని.లకు ఈ టెలిమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. గురువారం 360 మంది కరోనా బాధితులకు వైద్య సలహాలు, మందులను అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.

ప్రతి రోజు 1000 మందికి సాయం
ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డాక్టర్ లోకేశ్వరరావు గారు జూమ్ కాల్ ద్వారా కరోనా బాధితులతో మాట్లాడి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. రోగుల ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు ఆధారంగా వారికి మందులు సూచించారు. వివిధ పరీక్షలు చేయించుకోవాలని రోగులకు సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ వైద్య సేవలతో పాటు పలు చోట్ల రోగులకు మందులు పంపిణీ చేశారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రతి రోజుకు 1000 మందికి టెలిమెడిసిన్ ద్వారా వైద్య సాయం చేసేందుకు ఏర్పాట్లు చేసిన ట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.

ఉదయం 7.30 గంటలకు టెలిమెడిసిన్ ప్రక్రియ ప్రారంభం
టీడీపీ పార్టీ వర్గాల ద్వారా జూమ్ కాన్పరెన్స్ లింక్ ను ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు టెలిమెడిసిన్ ప్రక్రియ ప్రారంభమౌతోందని తెలిపారు. అటు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలకు పలువురు తమ తోడ్పాటునందించేందుకు ముందుకు వస్తున్నారు. టీడీపీ వైద్య విభాగం అధ్యక్షుడు జెడీ శివప్రసాద్ సుమారు 5 వేల మందికి మందుల పంపిణికి ముందుకు వచ్చారు.
Recommended Video

అదనంగా డాక్టర్ల నియామకం
తొలి రోజు కరోనా బాధితులకు అందించిన సహాయంపై ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ భవనేశ్వరి సమీక్షించారు. టెలిమెడిసిన్ సేవలను మరింత మెరుగుగా అందించేందుకు అదనంగా వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. తద్వారా ఎక్కవ మంది రోగులకు సహాయం అందించేందుకు తోడ్పడుతుందని భువనేశ్వరి పేర్కొన్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications