రైలు ప్రయాణికులకు శుభవార్త: ఆర్ఏసీ బెర్తుల పెంపు
రైలు ప్రయాణికులకు మరో తీపికబురునందించింది రైల్వేశాఖ. అన్ని రైళ్లలో ఆర్ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించింది.
హైదరాబాద్: రైలు ప్రయాణికులకు మరో తీపికబురునందించింది రైల్వేశాఖ. అన్ని రైళ్లలో ఆర్ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించింది. జనవరి 17 నుంచి అన్ని రైళ్లలో అదనపు ఆర్ఏసీ కోటాను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.
ఆర్ఏసీ విభాగంలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో స్లీపర్ కోచ్లో ఐదు సైడ్లోయర్ బెర్తుల్లో పది మందికి, మూడో తరగతి ఏసీ కోచ్లో రెండు సైడ్ లోయర్ బెర్తుల్లో నలుగురిని, రెండో తరగతి ఏసీ కోచ్లో లోయర్ బెర్తులో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించేవారు.

తాజాగా ఆ సంఖ్యను పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. స్లీపర్ కోచ్, మూడో తరగతి ఏసీలో మరో రెండు లోయర్ బెర్తుల్లో ఆర్ఏసీ ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. రెండో తరగతి ఏసీలో మరో లోయర్ బెర్తును ఆర్ఏసీ విభాగంలోకి చేర్చింది. ప్రస్తుత నిర్ణయంతో ప్రయాణికులకు అదనంగా ప్రయోజనం దక్కనుంది.
ఆర్ఏసీ టికెట్దారునికి సీటు ఖరారైనా రాత్రి పడుకునేందుకు అవసరమైన బెర్తు నిరీక్షణ జాబితాలో ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ కొనుగోలుదారు సమయానికి రైలు ఎక్కకపోయినా, రద్దు చేసుకున్నా వారి బెర్తును ఆర్ఏసీ టికెట్ కొనుగోలుదారులకు కేటాయిస్తారు. ఇద్దరికి ఆర్ఏసీ టికెట్లుంటే బెర్తును రెండు సీట్లుగా విభజిస్తారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications