కాంగ్రెస్ కు మరో ఝలక్ ..! ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఔట్..!!
హైదరాబాద్ : పది చిలకలూ..ఎగురుచుండగా..! ఎగరలేక ఒకటి పోతే తొమ్మిది..! తొమ్మిది చిలకలూ.. ఎగురు చుండగా.. ఎగకలేక ఒకటి పోతే ఎనిమిది..! కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ పాడిన పాట గుర్తొస్తుంది. తెలంగాణ రాజకాయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ 2019 క్యాలెండర్ లో నెలలు మారుతున్నట్టు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
లోక్ ఎన్నికలకు ముందే ఈ పరిస్థితి ఉంటే లోక్ సభ ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీకి ఆశించిన మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీలో ఇంకెంత మంది నాయకులు మిగులుతారనేది ప్రశ్నార్థకంగా తయారయ్యింది. తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు ఆయన అనుచరుల్లో పెద్ద యెత్తున ప్రచారం జరుడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతోంది.
సర్వే ఆధారంగానే టీఆర్ఎస్ టికెట్లు .. నేడు ఆరుగురి పేర్లు ప్రకటించే అవకాశం
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనున్నది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే డీ. సుధీర్ రెడ్డి మరికాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవనున్నారు. కేటీఆర్ భేటీ తరువాత సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. కొద్దిరోజులుగా సుధీర్ రెడ్డి పార్టీ మారతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం 19 కాగా ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సుధీర్ రెడ్డి చేరికతో ఆ బలం కాస్తా 12 కు పడిపోనున్నది. ఇంకా మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ మార్పు విషయమై ఇప్పటికే సుధీర్ రెడ్డి ముఖ్య నాయకులు, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.