భాగ్య నగరవాసులు ఖాళీ దొరికితే ఇక్కడికే క్యూ కడతారు.. 20 కి. మీ దూరంలోనే..
హైదరాబాద్ వాసులు ఖాళీ సమయాల్లో ప్రశాంతంగా సేదతీరేందుకు అనువుగా... అందమైన, ఆహ్లాదకర ప్రదేశం ఉందని మీకు తెలుసా..? హైదరాబాద్ కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రకృతి రమణీయమైన ప్రదేశం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ లేక నిండు కుండలా తొణికిసలాడుతూ హైదరాబాద్ వాసులకు ఒక ప్రశాంతమైన విహార ప్రదేశంగా మారింది. గండిపేట చెరువు అని పిలిచే ఈ ప్రాంతం నగర ప్రజలకు ఫర్ ఫెక్ట్ పిక్నిక్ ప్రదేశంగా ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇక్కడ ఆహ్లాదంగా సేద తీరవచ్చు. అందుకే ఈ ప్రాంతానికి నగర వాసులు క్యూ కడుతున్నారు. గతంలో ఉస్మాన్ సాగర్ గండిపేట వద్ద ప్రకృతి పరవశించేలా ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అత్యంత సుందరంగా ఎకో పార్కును తీర్చిదిద్దారు. పర్యాటకులు సేదతీరేందుకు వీలుగా అత్యాధునిక సదుపాయాలతో పార్కును నిర్మించారు.
గండిపేట చరిత్ర ఓసారి చూస్తే.. 1908 లో మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. ఈ క్రమంలో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు గండిపేట గ్రామం వద్ద మూసీ నదిపై 1920లో ఆనకట్ట నిర్మించారు. గండిపేటకు జంట జలాశయం అయిన హిమాయత్ సాగర్ ను కూడా నిజాం ప్రభుత్వంలో నిర్మించారు. హిమాయత్ సాగర్ ను 1927లో నిర్మించారు. ఈ రెండు జలాశయాలు అప్పటి నుంచి నగర ప్రజల దాహార్తిని తీరుస్తూ ప్రసిద్ధిచెందాయి.

గండిపేట వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ఐదున్నర ఎకరాల్లో 35కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. జలాశయం అందాలను ఆహ్లాదకర వాతావరణం మధ్య చూడటం నగరవాసులకు కనువిందుగా అనిపిస్తుంది. గండిపేట వచ్చే సందర్శకులకు ఈ పార్కు ఏర్పాటుతో మౌలిక వసతుల కొరత తీరింది. ఎంట్రెన్స్ ప్లాజాతోపాటు వాక్ వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పాట్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే ఉదయం 7 నుంచి రాత్రి 7:30 వరకు ఈ పార్క్ తెరిచే ఉంటుందట. ఇక ఈ గండిపేట చెరువును చూసేందుకు వారాంతాల్లో 50,000 నుంచి 1 లక్ష మంది వరకు సందర్శకులు గండిపేటకు వస్తుంటారని సమాచారం.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications