2016: హైదరాబాద్ విమానాశ్రయంలో పాకిస్తాన్ సింగర్కు చుక్కలు, కారణం ఇదే
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి అబుదబీ నుంచి హైదరాబాద్ వచ్చిన పాకిస్తాన్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం చుక్కెదురయింది.
అతను ఎమిరేట్స్ విమానంలో అబుదబీ నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై అయిదు నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అతనిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. అతడు పాకిస్తాన్ దేశానికి చెందినవాడిగా అధికారులు గుర్తించారు.
దీంతో అతడిని అదే విమానంలో దుబాయ్ తిప్పి పంపించారు. పాకిస్తాన్ ప్రయాణీకులు నేరుగా శంషాబాద్ విమానాశ్రయంకు వచ్చేందుకు అవకాశం లేదని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ రావాలనుకుంటే ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి డొమెస్టిక్ విమానాల ద్వారా ఇక్కడకు రావాలని అతనికి సూచించారు.

హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో తన సంగీతాన్ని వినిపించేందుకు పాక్ సంగీత దిగ్గజం రహత్ ఫతే అలీ ఖాన్ గురువారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. నిబంధనల కారణంగా అతనికి అధికారులు చుక్కలు చూపించారు.
అబూదాబీ నుంచి ఆయన దిగగానే, తిరిగి అదే విమానంలో వెనక్కు పంపించారు. ఆయన ప్రయాణడాక్యుమెంట్లలో సాంకేతిక లోపాలున్నాయని అధికారులు చెప్పారు. ఎవరైనా పాకిస్థాన్ దేశస్తులు నేరుగా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగేందుకు నిబంధనలు అనుమతించవని చెప్పి అతనిని తిరుగు విమానం ఎక్కించారు.
కాగా, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై మెట్రో విమానాశ్రయాల నుంచి మాత్రమే పాకిస్తాన్ జాతీయులు భారత్లో అడుగు పెట్టాల్సి ఉంది. దీంతో సాయంత్రం ఎనిమిది గంటలకు జరగాల్సిన అతని సంగీత ప్రదర్శన రాత్రి పదకొండు గంటలకు వాయిదా పడింది.
సమాచారం మేరకు... అలీ ఖాన్ తిరిగి అబూదాబీ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి, మరో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ముందు జరగాల్సిన సంగీత ప్రదర్శన, నూతన సంవత్సరం వచ్చిన తర్వాత మొదలు కాగా రాత్రి ఒంటి గంట వరకూ మాత్రమే వేడుకలకు అవకాశం ఉండటంతో, కొద్దిసేపు మాత్రమే అలీ ఖాన్ సంగీత ప్రదర్శన జరిగింది.
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications