బీఆర్ఎస్ సర్కారుపై పవన్ కళ్యాణ్ పరోక్షవిమర్శలు: టీడీపీకి ధన్యవాదాలు
హైదరాబాద్: బీజేపీ-జనసేన అభ్యర్థుల తరపున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే యువత ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు కానీ.. వారి ఆశలు నెరవేరలేదన్నారు పవన్. ఉత్తరాంధ్రకు చెందిన 26 వెనుకబడిన కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారని.. బీజేపీ-జనసేన అధికారంలోకి రాగానే 26 కులాలకు న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

పేరుకే ఉత్తరాంధ్ర వాసులైనా తెలంగాణను మాతృభూమిగా చేసుకుని జీవిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్రంలోని పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన ఆవిర్భావం తెలంగాణలోనే జరిగిందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
జనసేనకు మద్దతు తెలిపేందుకు సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ప్రేమ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ ఓటర్లను కోరారు. తెలంగాణలో బీజేపీ-జనసేన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Seeing Pawan Kalyan At Kukatpally 😍💙 pic.twitter.com/hfvaTUuMD8
— uppalapati Ram varma (@uppaalapatiRam) November 26, 2023
ఇది ఇలావుండగా, ఆదివారం సాయంత్రం కూకట్పల్లిలో నిర్వహించిన బీజేపీ-జనసేన సభ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని అదుపు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు కార్యకర్తలు పోలీసులపైకి కుర్చీలు విసిరారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications