జయరామ్ హత్య కేసు .. రాకేష్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు .. సంవత్సరం నో బెయిల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పై పీడీయాక్ట్ నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. చిగురుపాటి రాకేష్ రెడ్డిపై శుక్రవారం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడికి బెయిల్ లేకుండా చేశారు. ఏడాది దాకా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా, బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ పెట్టారు పోలీసులు.
డబ్బు కోసం అతి కిరాతకంగా పారిశ్రామికవేత్త జయరాం ను హతమార్చి కార్ యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు రాకేష్ రెడ్డి. ఈ హత్యా కేసులో పోలీసుల , రాజకీయ నాయకుల, సినీ పరిశ్రమకు చెందిన ఓ ఆర్టిస్ట్ సహాయం తీసుకున్న రాకేష్ రెడ్డి నేరాల చిట్టా విప్పిన పోలీసులు అతను బయట సమాజంలో ఉంటె ప్రమాదం అని భావించి అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కటకటాల పాలు చేశారు. ప్రస్తుతం రాకష్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నాడు.

మొదట అందరూ ఈ హత్యకేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని భావించారు. జయరాం భార్య సైతం శిఖా చౌదరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితురాలు అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆమె ప్రమేయం ఏం మాహ్రం లేదని తేల్చేశారు. ఇక రాకేష్ రెడ్డి విషయంలోనే కఠిన నిర్ణయం తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications