వరుసగా రేప్ పార్టీలు: నిర్వాహకుడిపై పీడీ యాక్ట్
హైదరాబాద్: రేవ్ పార్టీ నిర్వాహకుడి పైన పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. శనవారం నాడు శంషాబాదులోని ఆర్జీఐఏ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మొయినాబాద్ పరిధిలోని చిలుకూరు శివారు ఫాంహౌజ్లో గత డిసెంబర్ 9వ తేదీన రాత్రి రేవ్ పార్టీ జరుగుతుండగా ఓఎస్టీ పోలీసులు దాడి చేశారు. పార్టీ నిర్వాహకుడు గుజరాత్ రాష్ట్రానికి చెందిన దిలీప్ జైన్తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. దిలీప్ జైన్ వయస్సు 56.

బోయినపల్లిలో నివాసముండే అతను తరుచూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్, ఆర్జీఐఏ, జవహర్ నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలోను పార్టీలు నిర్వహించడంతో అతడి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పోలీసులు శనివారం దిలీప్ జైన్ పైన పీడీయాక్ట్ నమోదు చేసి రిమాండుకు తరలించారు.












Click it and Unblock the Notifications