స్నేక్గ్యాంగ్పై పీడీ యాక్ట్ అమలు: సివి ఆనంద్
హైదరాబాద్: పహాడీషరీఫ్ స్నేక్ గ్యాంగ్లోని ఇద్దరు నిందితులపై పీడీ చట్టం అమలు అవుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మహ్మద్ ఇసాక్, సయ్యద్ బసలామాలపై పీడీ చట్టం పెట్టినట్లు చెప్పారు.
స్నేక్గ్యాంగ్ నిందితులు కొద్ది నెలల క్రితం పాములతో బెదిరింపులకు గురిచేసి యువతులపై అత్యాచారాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. స్నేక్ గ్యాంగ్ అరాచకాలు పెరిగిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఉప్పల్లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైయ్యారు. ట్యూషన్కు వెళ్లిన వాసవి, జానకి అనే విద్యార్థినులు ఇంటికి తిరిగి రాలేదు. బాలికల ఆచూకీ కోసం తల్లిదండ్రులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆందోళనచెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హరిహరపురం కాలనీలో దొంగ అరెస్టు
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం హరిహరపురం కాలనీలో పోలీసులు ఓ దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 65 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బంగారం కుదువ పెట్టుకున్న ముగ్గురు స్వర్ణకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications