Phone tapping case: నార్కో టెస్టులకు రెడీ; రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి దమ్ముందా?
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా మరో మారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే నార్కో అనాలసిస్, లైట్ డిటెక్టర్ టెస్ట్ లకైనా నేను సిద్ధంగా ఉన్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: కేటీఆర్
తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు తనతోపాటు లైట్ డిటెక్టర్, నార్కో అనాలసిస్ టెస్ట్ లకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తన ఫోన్ తో పాటుగా రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గంలోని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల ఫోన్లను, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

ఆ దమ్ము రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి లేదు
తాము ట్యాప్ చేయడం లేదని చెప్పే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేంద్రం పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలోని ప్రతి ప్రతిపక్ష నాయకుడి ఫోన్లను ట్యాప్ చేస్తుందని, కాదని చెప్పే ధైర్యం కిషన్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ప్రజల ముందు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తను ఏ పరీక్షకైనా సిద్ధమన్న మాజీ మంత్రి కేటీఆర్, గన్ పార్క్ అయినా మరే బహిరంగ వేదిక మీద అయినా తాను చర్చకు సిద్ధమన్నారు.
కోర్టులో నిరూపించాలని కేటీఆర్ సవాల్
ఏ పరీక్షల కైనా తాను రెడీగా ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద ఒక అధికారిక ప్రకటన అయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రతిరోజు మీడియాకు లీకులు ఇస్తున్న లీక్ వీరుడు ఈ అంశం మీద ఇప్పటివరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రశ్నించారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆ ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలని, కోర్టులో నిరూపించాలని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వం నీదే కదా.. నిన్నెవరు ఆపుతున్నారు
ప్రభుత్వం నీదే కదా నిన్ను ఎవడు ఆపుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్ నీకు సత్తా ఉంటే నీ ప్రభుత్వానికి దమ్ముంటే ఆధారాలతో కోర్టు ముందు నిలబెట్టడం అంటూ సవాల్ విసిరారు. తప్పు చేసిన వాడిని శిక్షించాలన్నారు. కాంగ్రెస్ హయాం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మన్మోహన్ సింగ్ ఫోన్ టాపింగ్ పై మాట్లాడిన మాటలను కేటీఆర్ ప్రస్తావనకు తెచ్చారు.
వారిపై పరువునష్టం దావా అందుకే వేశా
తనకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని ఎంత చెప్పినా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మంత్రులకు అందుకే నోటీసులు ఇచ్చానని పరువు నష్టం దావా వేశానని చెప్పారు. కేంద్రంలోని బీజేపీని రాష్ట్రంలోని కాంగ్రెస్ ను తిట్టిపోశారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భయపడేది లేదని, ఆధారాలు ఉంటే నిరూపించి శిక్షించాలన్నారు.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications