phonetapping case: ముగిసిన మాజీ ఎంపీ సంతోష్‌ రావు విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌ రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో ఆయనను అధికారులు 7 గంటలకు పైగా విచారణ చేశారు. విచారణలో భాగంగా సంతోష్​ రావును పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్‌ లను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌ రావు విచారణ ముగిసింది. అంతకుముందు ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ సంతోష్‌ రావుకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. జనవరి 27 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సంతోష్‌రావు కు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 7 గంటలకు పైగా విచారణ జరిగింది.

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా ప్రభాకర్‌ రావు నియామకంపై నిర్ణయం ఎవరిదని సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్‌రావులను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

phonetapping case The questioning of former brs MP Santosh Rao in the has concluded today

ఇక ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ బాధ్యతలను హైదరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ లను విచారణ చేపట్టారు. ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్‌ రావు ను పిలవడంతో రాబోయే రోజుల్లో దర్యాప్తు ఎటువంటి మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+