ఐస్క్రీం తింటూ.., యువతుల చిందు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదులో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి నగర పోలీసు శాఖ సర్వం సిద్ధం చేసింది. నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పటిష్ట చర్యలు చేపట్టింది. నగరంలో మొత్తం 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లకు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు వివరించేందుకు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిమజ్జనం పరిసరాల్లో 40 స్టాటిక్ క్రేన్లతో పాటు 71 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ క్రేన్లను స్థానికంగా గణేష్ మండపాల వద్ద మండప నిర్వాహకుల సహాయార్థం వినియోగిస్తామని చెప్పారు.
ట్రాఫిక్
ఆంక్షలు
కట్టుదిట్టం
చేయటంతోపాటు
7
సిఆర్పిఎఫ్,
4
ర్యాపిడ్
ఆక్షన్
ఫోర్స్
బృందాలను
ఉపయోగిస్తామని
వెల్లడించారు.
అలాగే
నగరంలో
310
అతి
సున్నిత
ప్రాంతాలతోపాటు
మరో
605
సున్నిత
ప్రాంతాలను
గుర్తించామని
అన్నారు.
అక్కడ
ప్రత్యేక
పికెటింగ్లను
ఏర్పాటు
చేసినట్లు
చెప్పారు.
వినాయక నిమజ్జనం
800 సిసి కెమెరాలతో జంట నగరాల్లో అడుగడుగునా నిఘా పటిష్టం చేయనున్నట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 30 బాంబు డిటెక్టివ్ స్వాడ్లు, 30 జాగీలాలతోపాటు రెండు అక్సెస్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనం
నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా జరిపేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో ఇప్పటికే చర్చలు జరిపామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, మతపరమైన అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అందులో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశామని, మరికొంత మందిని కూడా అరెస్ట్ చేయనున్నట్టు తెలిపారు.
వినాయక నిమజ్జనం
ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు శాంతి, మైత్రి కమిటీలతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామని కమిషనర్ గుర్తు చేశారు.
వినాయక నిమజ్జనం
అలాగే ట్యాంక్ బండ్ వద్ద అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేలా విశాఖ ఓడ రేవు నుంచి గజ ఈతగాళ్లను రప్పించామని మహేందర్ రెడ్డి తెలిపారు.
వినాయక నిమజ్జనం
అల్ఖైదా ఉగ్రవాద సంస్థ భారత్లో తన కార్యకలాపాలు ప్రారంభించిందని తెలియడం, నగరానికి చెందిన కొంతమంది యువకులు ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్లి కలకత్తాలో దొరికిపోవడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గణేష్ ఉత్సవాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశాలు లేకపోలేదని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు మరింత జాగ్రత్తపడ్డారు.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్ పరిసరాల్లో శనివారం నాడు పలు గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జాం దృశ్యం.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్ పరిసరాల్లో శనివారం నాడు పలు గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జాం దృశ్యం.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్ పరిసరాల్లో శనివారం నాడు పలు గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జాం దృశ్యం.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్ పరిసరాల్లో శనివారం నాడు పలు గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఓ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న దృశ్యం.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా సాగర్లోని గణేష్ వ్యర్థాలను వెలికి తీస్తున్న దృశ్యం.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఓ వినాయకుడిని భారీ క్రేన్ ద్వారా నిమజ్జనం చేస్తున్న దృశ్యం.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఓ వినాయకుడిని భారీ క్రేన్ ద్వారా నిమజ్జనం చేస్తున్న దృశ్యం.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. శనివారం నాడు చాలా గణేషుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు. వర్షం కురిసినప్పటికీ భక్తులు నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రిక్షా
హైదరాబాదులోని ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఆ పక్క నుండి ఓ ఓ చిన్నారి రిక్షా తొక్కుకుంటూ వెళ్తూ...
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం చూసేందుకు వచ్చిన యువతీ, యువకులు ఇలా ఐస్ క్రీం తింటూ...
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. శనివారం నాడు చాలా గణేషుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు. వర్షం కురిసినప్పటికీ భక్తులు నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వినాయక నిమజ్జనం
హైదరాబాదులోని ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఓ చిన్ని వినాయకుడిని నిమజ్జనానికి తీసుకు వచ్చిన అమ్మాయిలు చిందేస్తూ..