దుర్గ కిడ్నాప్ కేసులో కొత్తకోణం: బయటపడిన వ్యభిచార ముఠా (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో కిడ్నాపైన చిన్నారి దుర్గ కేసు దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును ఛేదించే క్రమంలో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బాలికలను, మహిళలను లక్ష్యంగా చేసుకొని వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఓ ముఠా పోలీసుల చేతికి చిక్కింది.
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎస్జే జనార్ధన్ ఆదివారం మీడియాకు నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 5న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దుర్గ (5) అనే బాలిక కిడ్నాప్కు గురైన సంఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని, ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా ఈ ముఠా పట్టుబడిందని ఆయన చెప్పారు.
బాలికను కిడ్నాప్ చేసిన మెదక్ జిల్లా జిన్నారం, ఐడీఏ బొల్లారం బాలాజీనగర్కు చెందిన సునీత (26), కుమార్ (24)లను అదుపులోకి తీసుకొన్నామని, వారి ఆధీనంలో ఉన్న మేదరి లత అనే మహిళను కూడా రక్షించామని ఆయన చెప్పారు.
కిడ్నాప్ ఇలా..
దుర్గ అనే బాలికను కిడ్నాప్ చేసే సమయంలో కుమార్, సునీత సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చారు. తర్వాత దుర్గ తల్లిని మాటలతో మోసగించి సునీత దుర్గను వెంట పెట్టుకుని స్టేషన్ బయటకు వచ్చింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కుమార్, సునీత రెతిఫైల్, ఒలిఫెంటా బ్రిడ్జి, చిలకలగూడ చౌరస్తా మీదుగా బోడుప్పల్కు చేరుకున్నారు.
కిడ్నాప్ ఇలా..
బోడుప్పల్లో నివాసం ఉన్న యాదగిరిగుట్ట వాసులు శంకర్ (51), భార్య దివ్య (25)లకు బాలికను రూ.3 వేల రూపాయలకు కుమార్ అమ్మారు. శంకర్ దంపతులు కూడా పిలల్ని కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాలకు అమ్ముతుంటారనే విషయం పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు.
కిడ్నాప్ ఇలా..
గతంలో పలుకేసుల్లో అరెస్టయిన శంకర్ బెయిల్పై వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు అని ఎస్పీ జనార్దన్ తెలిపారు. ఈ వ్యవహారంలో మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జాప్తి శివనూర్ సరోజనగర్కు చెందిన మేకల బూస,(55), కౌడిపల్లి మండలం కొట్టాల చింతల కమలమ్మ (48)లను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.
కిడ్నాప్ ఇలా..
కిడ్నాప్ చేసిన బాలికను గుర్తు పట్టకుండా గుండు చేయించారని, బాలికను చేరదీసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని జనర్దన్ తెలిపారు తెలిపారు.
గతంలో కూడా..
నెలక్రితం వైష్ణవి అనే ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి శంకర్, దివ్యలకు అమ్మినట్లు విచారణలో తెలుసుకున్నామని, బాలిక తల్లిదండ్రుల వివరాలు చెప్పకపోడవంతో ఆమెను రెస్య్కూహోంకు తరలించామని పోలీసులు మీడియాకు చెప్పారు.
పోలీసులకు అభినందన
పదిరోజుల్లోనే ముఠాను అరెస్టు చేసి, బాలికను కాపాడిన ఇన్స్పెక్టర్, సిబ్బందిని ఎస్పీ జనార్దన్ అభినందించి రివార్డులు అందజేశారు.