డీకే అరుణకు ఓటేసి జవాబివ్వండి: మోడీ గ్యారంటీలు ఇవేనంటూ ప్రధాని
మహబూబ్నగర్: ఈ లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే ఆరుణకు మద్ధతుగా నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఇండియా కూటమి, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
'నా పాలమూరు సోదరసోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నా' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మోడీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే దేశ భద్రతకు గ్యారంటీ అని, మోడీ గ్యారంటీ అంటే విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే ఇచ్చిన హామీలు నెరవేరతాయనే గ్యారంటీ అని స్పష్టం చేశారు.

గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ఆయన ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కులాల పేరిట, మతాల పేరిట విభజించాలని చూస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. దేశం ఏమైపోయినా కాంగ్రెస్కు అవసరం లేదని, దానికి రాజకీయ లబ్ధి మాత్రమే కావాలని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఎన్నికలొస్తేనే తన ప్రేమ దుకాణం తెరుస్తారని ఎద్దేవా చేశారు.
మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే మత మార్పిడులు పెరుగుతాయన్నారు ప్రధాని మోడీ. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్కు తెలుసు. మతపరమైన రిజర్వేషన్లను అంబేద్కర్ కూడా తిరస్కరించారు.
అయినప్పటికీ కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా అని మోడీ ఆరోపించారు.
కాంగ్రెస్కు హిందువులపైగానీ, దేశంపైగానీ ప్రేమలేదన్నారు ప్రధాని మోడీ. వంచితుల కోసం మోడీ చౌకీదార్లా ఉంటారన్నారు. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణను గెలిపించాలని.. ఆమెకు వేసే ప్రతి ఓటు తనకే చెందుతుందన్నారు. డీకే అరుణపై స్వయంగా ముఖ్యమంత్రే దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఓటు ద్వారానే జవాబివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు ఇళ్లకు వెళ్లిన తర్వాత మీకు తెలిసినవారందరికీ మోడీ నమస్కారాలు తెలియజేశారని చెప్పండి అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications