జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు (ఫోటోలు)
హైదరాబాద్: జల్సాలకు అలవాడు పడి తేలికగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన 20 తులాల బంగారు, 30 తులాల వెండి నగలు స్వాధీనం చేసుకొన్నారు.
గురువారం బాలానగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్, బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ర్టానికి చెందిన కిషోర్సింగ్ అలియాస్ జత్తూసింగ్ , రచన్సింగ్, దీపక్సింగ్ అలియాస్ దీపుసింగ్, జగత్సింగ్, సంతోష్ సింగ్ ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం వృత్తిగా చేసుకున్నారు. సెప్టెంబర్ 6న గాజుల రామారంలో నివాసముండే కళ్యాణకర్ శంకర్ ఇంటికి తాళాలు వేసి తన కుటుంబసభ్యులతో కలసి స్వస్థలమైన నిజామబాద్కు వెళ్లారు. 8న ఇంటికి చేరుకునే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
2.5తులాల బంగారు నగలు కనిపించలేదు. వెంటనే జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా 19న శాపూర్నగర్లోని కూరగాయల మార్కెట్లో అనుమానస్పదంగా తిరుగుతున్న కిషోర్సింగ్, రచన్సింగ్ దీపక్సింగ్, జగత్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి సొత్తు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. బైక్ దొంగ అరెస్టు:

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
గుజరాత్ రాష్ర్టానికి చెందిన కిషోర్సింగ్ అలియాస్ జత్తూసింగ్ , రచన్సింగ్, దీపక్సింగ్ అలియాస్ దీపుసింగ్, జగత్సింగ్, సంతోష్ సింగ్ ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం వృత్తిగా చేసుకున్నారు.

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో చింతల్ అంబేద్కర్ నగర్లో నివాసముండే జలగరి శ్రీనివాస్ (29)ఆటో నిడిపిస్తూ జీవితం సాగిస్తున్నాడు. తెల్లవారు జామున రోడ్డు పక్కన పార్కు చేసిన బైక్లను దొంగిలించడం పనిగా పెట్టుకున్నాడు.

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
సనత్ నగర్ పరిధిలోని కార్మిక నగర్లో నివాసం ఉండే చారి తన పిల్లలను నగేష్ (26) అనే ఆటో డ్రైవర్ ఆటోలో రోజూ స్కూలుకు పంపిస్తూ ఉంటాడు. రోజు మాదిరిగానే ఈనెల 18న చారి భార్య తన పిల్లలను ఆటోలో ఎక్కించి గేటు వేసి పక్కింటికి వెళ్లింది. ఇది ఆటో డ్రైవర్ నగేష్ గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలో ఉన్న రూ. 57 వేల నగదును దొంగిలించి ఎప్పటిలాగే వచ్చి ఆటోను తీసుకొని స్కూలుకు వెళ్లి పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు.

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద గల రూ. 57వేల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి గురవారం రిమాండ్ కు తరలించారు.
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో చింతల్ అంబేద్కర్ నగర్లో నివాసముండే జలగరి శ్రీనివాస్ (29)ఆటో నిడిపిస్తూ జీవితం సాగిస్తున్నాడు. తెల్లవారు జామున రోడ్డు పక్కన పార్కు చేసిన బైక్లను దొంగిలించడం పనిగా పెట్టుకున్నాడు.
సూరారం కాలనీ రాజీవ గృహకల్పలో నివాసం ఉండే దుగ్గిర్యాల సధాకర్ ఈనెల 16న తన బైక్ కన్పించకుండా పోయింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు గురవారం ఉదయం జీడిమెట్ల బస్ డిపో సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమాస్పదంగా కన్పించిన శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారించగా బైక్ దొంగతనాల గురించి చెప్పాడు. ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
కటకటాల పాలైన ఆటో డ్రైవర్:
బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి గురువారం బాలా నగర్లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఏఆర్ శ్రీనివాసులు వెల్లడించిన సమాచారం ప్రకారం సనత్ నగర్ పరిధిలోని కార్మిక నగర్లో నివాసం ఉండే చారి తన పిల్లలను నగేష్ (26) అనే ఆటో డ్రైవర్ ఆటోలో రోజూ స్కూలుకు పంపిస్తూ ఉంటాడు.
రోజు మాదిరిగానే ఈనెల 18న చారి భార్య తన పిల్లలను ఆటోలో ఎక్కించి గేటు వేసి పక్కింటికి వెళ్లింది. ఇది ఆటో డ్రైవర్ నగేష్ గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలో ఉన్న రూ. 57 వేల నగదును దొంగిలించి ఎప్పటిలాగే వచ్చి ఆటోను తీసుకొని స్కూలుకు వెళ్లి పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు.
ఇంటి యజమానురాలు దొంగతనం జరిగినట్లు గుర్తించి విషయాన్ని భర్తకు తెలిపింది. బాధితురాలు ఆటో డ్రైవర్పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద గల రూ. 57వేల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి గురవారం రిమాండ్ కు తరలించారు.












Click it and Unblock the Notifications